సిద్దిపేట : ఇంటర్ ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అవకతవకలు జరిగాయని, అందుకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల జీవితాలతో తెలంగాణ సర్కార్ చెలగాటం ఆడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనని..ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించినా ఎన్నడూ ఇలాంటి అవకతవకలు జరగలేదన్నారు. విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు.