ఇంటర్ ఫలితాల్లో గందరగళంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ప్రగతి భవన్ వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అర్ధనగ్న ప్రదర్శనకు యత్నించిన జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.