కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి, కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్లో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అయితే.. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె ధర్నా చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. ధర్నా చేస్తున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.