మగాళ్లే కాదు.. చైన్ స్నాచింగ్లో మేమూ దిట్టలమే అంటున్నారు అమ్మాయిలు. తాజాగా.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్లో ఇద్దరు అమ్మాయిలు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. బస్టాండ్లో కూర్చున్న మహిళల నుంచి తెలివిగా చైన్స్ను దొంగిలించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాసేపటికి గొలుసులు కన్పించకపోవడంతో బాధితురాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఈ అమ్మాయిలను అరెస్ట్ చేశారు.