హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలకు విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ గ్లోబరినా సంస్థ అన్నీ తప్పిదాలే చేస్తోందన్నారు. ఇంటర్ డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం ఉందా అనే అనుమానంగా ఉందన్నారు. ఓఎంఆర్ షీట్ ఇచ్చినా మార్కులు సరిగా ఎంటర్ చేయలేక పోయిందని విమర్శించారు. గ్లోబరినా సంస్థపై ఫిర్యాదులు వచ్చినా సీఎస్ స్పందించలేదన్నారు. ఇంటర్ బోర్డు, టీ-సర్కార్ తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టును తప్పుదారి పట్టించారని విమర్శించారు. భవిష్యత్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.