ఖమ్మం: ఇంటర్ ఫలితాల అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన ర్యాలీలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు.