ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: భట్టివిక్రమార్క

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2019, 02:59 PM

ఖమ్మం: ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన ర్యాలీలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాల్గొన్నారు. ఇంటర్‌ బోర్డు తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. గ్లోబరీనా సంస్థ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com