తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటిని అందించేందుకు నిర్మిస్తున్న బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో మిషన్ భగీరథ వినూత్న పథకంగా హడ్కో అభివర్ణించింది. మిషన్ భగీరథకు మూడోసారి హడ్కో అవార్డు లభించడం విశేషం. ఢిల్లీలో జరిగిన హడ్కో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొని.. హడ్కో అవార్డును ఈఎన్సీ కృపాకర్రెడ్డి స్వీకరించారు.
ఈసందర్భంగా మాట్లాడిన కృపాకర్రెడ్డి.. అనుకున్న సమయానికి మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతీ ఆవాసానికి తాగునీటిని అందించగలుగుతున్నామన్నారు. తమ ఇంజినీర్లు, సిబ్బంది, వర్క్ ఏజెన్సీల సమిష్టి కృషితో దేశం మొత్తానికి మిషన్ భగీరథ రోల్ మోడల్గా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తాగునీటి ఎద్దడి మాటే వినిపించదని కృపాకర్రెడ్డి హామీ ఇచ్చారు.