భువనగిరి పట్టణంలో R B నగర్ లొ ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసారు. ఈ దాడిలో దొరికిన 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్ ఓ టీ పోలీసులు వారి నుంచి 3,01,000.రూపాయల నగదు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసిట్టు ఎస్ ఓ టి ఇన్స్పెక్టర్ రాజు వర్మ చెప్పారు. కేసు నమోదు చేసి భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించామని రేపు కోర్టులో ప్రవేశ పెడతామని తెలిపారాయన.