తెలంగాణ ఉద్యమ పాత్రలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న తుల ఉమకు టీఆర్ఎస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కథలపూర్ మండలం జడ్పీటీసీ టికెట్ను నాగం అమృతకు కేటాయించడం పట్ల టిఆర్ెస్లోనూ కలకలం రేగుతోంది. ఈమేరకు గురువారం . వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు.. కథలపూర్ మండల టికెట్ జెడ్పీటిసిగా నాగం అమృతకు బీ-ఫార్మ్ కూడా అందజేసిన విషయం తెలిసిన పార్టీ శ్రేణులు అధినాయకత్వంపై మండి పడుతున్నాయి.
కాగా ఈ వ్యవహారం తుల ఉమకు కనీస సమాచారం కూడా లేదని తెలుస్తోంది. ఎంపీ కవితతో మంచి స్నేహబంధం ఉన్నప్పటికీ ఈ విషయంలో తను ఉమకు సమాయం చేయలేనని కవిత తేల్చి చెప్పినట్టు సమాచారం . దీంతో ఆమె అనుచరులు, కార్యకర్తలు ఒకింత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్పందించేందుకు ఉమ ఇంటి నుంచి కూడా బైటకు రాకపోవటం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి శ్రేణులు