ఈ నెల 27 వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టిఆర్ఎస్) 18 వ ఆవిర్భావ దినోత్సవానికి నాయకులు, ఎంఎల్ఎ లు, ఎంఎల్సి లు, ఎంపి లు కచ్చితంగా పాల్గొనాలని టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కెటి రామారావు సూచించారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ ఏడాది టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు నిర్వహిస్తాయని.. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నవారు కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.