ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరాడంబరంగా టిఆర్ ఎస్‌ ఆవిర్భావ దినోత్స‌వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 12:16 AM

ఈ నెల 27 వ తేదీన  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టిఆర్‌ఎస్‌) 18 వ ఆవిర్భావ దినోత్సవానికి  నాయకులు, ఎంఎల్‌ఎ లు, ఎంఎల్‌సి లు, ఎంపి లు క‌చ్చితంగా పాల్గొనాల‌ని  టిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి కెటి రామారావు సూచించారు. గురువారం ఆయ‌న   ఓ ప్రకటన  విడుద‌ల చేస్తు,   రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ ఏడాది టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు.  గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు నిర్వహిస్తాయని.. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నవారు  కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com