హైదరాబాద్: రాజేంద్రనగర్ హైదర్గూడలో విషాదం చోటు చేసుకున్నది. పార్కులో ఆడుకుంటూ ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. పార్కులో ఆడుకుంటుండగా.. ఆరేళ్ల బాలుడు బిశాన శర్మపై సిమెంటు బెంచి పడింది. దీంతో బాలుడి తలకు బలమైన గాయం కావడంతో బాలుడు మృతి చెందాడు. విరిగిన సిమెంట్ బెంచి ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. జనప్రియ అపార్ట్మెంట్లోని పార్కులో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.