కృష్ణా జిల్లాలో పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరగిపోవడంతో కీ మెన్ అప్రమత్తమవడంతో ఈ ప్రమాదం తప్పింది. జిల్లాలోని మండవల్లి మండలం భైరవపట్నం దగ్గర రైలు పట్టా విరిగింది. విషయం తెలుసుకున్న కీ మెన్ బ్రిజ్మోహన్ అప్రమత్తమవడంతో తృటిలో ప్రమాదం తప్పిపోయింది. మరమ్మతుల అనంతరం అరగంట ఆలస్యంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు నడుస్తున్నాయి.