హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్తు విశారద పరీక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలు ఈ ఏడాది డిసెంబరులో హైదరాబాదు, నారాయణ్ ఖేడ్, వరంగల్, నిర్మల్ కేంద్రాల్లో జరుగుతాయని పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య తెలిపారు. కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను పరిషత్తే ముద్రించి విద్యార్థులకు అందచేస్తోంది. ఈ కోర్సుల్లో చేరేవారు తరగతులకు హాజరు కానవసరం లేకుండానే, ఇంటివద్దనే చదువుకొని పరీక్షలు రాయవచ్చు.