హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను ప్రతి యేటా నిర్వహిస్తారు. ఈసారి పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్షను 1,03,591 మంది విద్యార్థులు రాశారు. ఈ పరీక్షను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్వహించింది. ఏప్రిల్ 16, 2019 న ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఫలితాలను నవీన్ మిట్టల్ ఐఏఎస్ విడుదల చేశారు. హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఉన్న ఎస్బీటీఈటీలో ఫలితాలను విడుదల చేశారు.