తెలంగాణ పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ విడుదల చేశారు. మొత్తం 92.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 16 నిర్వహించిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,03,587 మంది విద్యార్థులు హాజరుకాగా..95,850 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మే మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించి, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. తాజా ఫలితాల్లో బాలురలో సృజన్, సాత్విక్, ఆశిష్రెడ్డి, సుమంత్, వరుణ్ తేజ ప్రథమ ర్యాంకు సాధించగా.. అమ్మాయిల్లో సాయి శ్రీహిత రెడ్డి తొలి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో నయన, లావణ్య, మహ్మద్ అస్మా, సంహితరెడ్డి, మహాలక్ష్మి నిలిచారు.