ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంకా అజ్ఞాతంలోనే: హైకోర్టుకెక్కిన కొండా విశ్వేశ్వరరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 01:45 PM

చేవేళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రె్డి ముందస్తు బెయిల్ కోసం  శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు.ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేశారనే కేసులో కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. అయితే ఈ అరెస్ట్ వారంట్ జారీపై నాంపల్లి కోర్టును కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు.పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ  ఇంతవరకు ఆయన ఆచూకీని మాత్రం కనిపెట్టలేదు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com