హైదరాబాద్ : వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి, ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ నౌహీరా షేక్ మీద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) కేసు నమోదు చేసింది. నౌహీరా షేక్ ను అదుపులోకి తీసుకునేందుకు ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేశారు. అధిక వడ్డీ ఆశ చూపించి అమాయకుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్లు నౌహీరా షేక్ పై ఆరోపణలున్నాయి. ఫైనాన్స్, గోల్డ్ స్కీముల్లో పెట్టుబడులు పెట్టినవారంతా మోసపోయారు. కర్ణాటక, మహారాష్ట్రలోనూ హీరా గ్రూప్ బాధితులున్నారు.