ప్రభుత్వం తప్పిదాల వల్ల 23 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారని మాజీ ఎంపీ వివేక్ ఆదేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాలు, దోషులు-పరిష్కార మార్గాలు అనే అంశంపై తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న గ్లోబరీన్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం దారుణమని అన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో వన్ మ్యాన్ రూల్ చేస్తున్నారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అడ్డుకోకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కోదండరామ్ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని వివేక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.