ట్రెండింగ్
Epaper    English    தமிழ்

29న ఇంటర్‌ బోర్డు ఎదుట ధర్నా : కోదండరామ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 03:09 PM

హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్‌ బోర్డు ఎదుట ఈ నెల 29న ధర్నా చేస్తామని టిజెఎస్‌ నేత కోదండరామ్‌ చెప్పారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని ఆయన అన్నారు. విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంటర్‌ ఫలితాలు, దోషులెవరు? పరిష్కారం ఏమిటి అనే అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కోదండరామ్‌, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, ఇతర సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న ఆసక్తి విద్యార్థులపై లేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com