ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రస్థాయి అటవీ అధికారుల వర్క్‌షాప్ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 03:21 PM

మేడ్చల్: దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో రాష్ట్రస్థాయి అటవీ అధికారుల రెండ్రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. వర్క్‌షాప్‌లో అటవీశాఖ గత ఏడాది పనితీరుపై అధికారులు సమీక్షించనున్నారు. అదేవిధంగా రానున్న ఏడాది కాలంలో లక్ష్యాలు, ప్రాధాన్యత అంశాలు, అటవీప్రాంతాల రక్షణ, అటవీ సంబంధిత కేసుల సత్వర పరిష్కారం, స్మగ్లింగ్, ఆక్రమణల నిరోధం, వేసవిలో వన్యప్రాణులకు నీటి సౌకర్యం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి, కాళేశ్వరం పరిధిలో పరిహార అటవీ పెంపకం, ఐదో విడత హరితహారం, నర్సరీలు, జిల్లాల వారీగా లక్ష్యాలపై అధికారులు వర్క్‌షాప్‌లో చర్చించనున్నారు. ఈ వర్క్‌షాప్‌లో పీసీసీఎఫ్ పి.కె.ఝా, అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాలకు చెందిన డీఎఫ్‌వో, ఎఫ్‌డీవోలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com