ఆగ్రా : ఎనిమిది నెలల గర్భిణిని అత్త చంపేసింది.. ఆ తర్వాత నిందితురాలు కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని రకబ్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మోహన్పురాలో చోటు చేసుకుంది. అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకున్న తీవ్ర వాగ్వాదం.. హత్య దాకా దారి తీసింది. దీంతో కోడలిని గర్భిణి అని కూడా చూడకుండా.. ఓ గదిలోకి తీసుకెళ్లింది అత్త. అనంతరం కోడలి గొంతును కత్తితో కోసి హత్య చేసింది. పలుమార్లు ఆమె శరీరంపై కత్తితో పొడిచింది. ఆ తర్వాత అత్త కూడా అదే కత్తితో పొడుచుకుంది. కుటుంబ సభ్యులు ఈ ఘటనను గమనించి.. అత్తాకోడళ్లు ఉన్న గది తలుపులు విరగొట్టారు. కోడలు ప్రాణాలు కోల్పోగా.. అత్త కొన ఊపిరితో ఉంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.