ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరాడంబరంగా ఆవిర్భావ దినోత్సవం : తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 05:31 PM

 టీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణభవన్ లో మీడియా సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. రేపు ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్ పై విశ్వాసంతోనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతున్నరని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి జీవనాడి అని..వెట్ రన్ ను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నరని అన్నారు. కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో కూర్చొని అడ్డగోలుగా మాట్లాడుతున్నరని తలసాని మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com