ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు: సీఎం కేసీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2019, 01:12 PM

కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీని సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. అంతకుముందు కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని కేసీఆర్‌ దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వరాలు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామన్నారు.  గోదావరి తీరాన అద్భుతమైన పుణ్యక్షేత్రంగా కాళేశ్వరం ఏర్పడుతుందన్నారు. ఆలయాభివృద్ధికి 600 ఎకరాల సేకరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఫారెస్ట్‌ స్థలాలు సేకరించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్‌ కారణంగా గొప్ప యాగం నిర్వహిస్తామన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి భారతీ తీర్థస్వామిని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. వేద పాఠశాల, కళాశాలతో కూడిన కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడుతామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com