అయినవాళ్లుదూరపు బంధువులు, చివరకు సొంత సంతానంలోనూ కరువైతే, ఓ స్వచ్చంధ సంస్ధ అంతిమసంస్కారాలు నిర్వహించిన ఘటనల మంచిర్యాలలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే మంచిర్యాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం లో “చంద్ బి” (రాజమని) అనే 70 సంవత్సరాల మహిళ వృద్ధురాలు 4 సవంత్సరాలుగా ఉంటోంది. కొన్నాళ్లు కుటుంబసభ్యులు వచ్చి వెళ్లినా, పోనుపోనూ ఆమెను చూసేందుకు వచ్చే వారే కరువయ్యారు. ఈ క్రమంలో ఆమె 18-05-2019 రాత్రి అకస్మాత్తుగా మరణించడంతో ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియచేసినా, వారు రాలేదు సరికదా కనీసం స్పందించక పోవటంతో సొసైటీ సభ్యులు పోలీసులకు ఇతర ప్రభుత్వ అధికారులకు తెలియప రిచారు. వారి సమక్షంలో చనిపోయిన వృద్ధురాలుకి రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహింయడంతో పాటు శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు చేసారు.