తెలంగాణ ఎమ్మెల్యేలకు అన్ని హంగులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో కొత్త అపార్ట్ మెంట్లు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ సిటీ హైదర్గూడలో హైటెక్ హంగులతో నిర్మించిన ఈ భవనాలకు సీఎం కేసీఆర్ సోమవారం (జూన్ 17)న ప్రారంభించారు. నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.166 కోట్ల ఖర్చుతో నిర్మించారు. వీటిలో ఎమ్మెల్యేలతోపాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు ఉండేందుకు వీలుగా నిర్మించారు. ఎమ్మెల్యేలందరికీ ఇందులోనే వసతి ఏర్పాటు చేశారు.
ఆరు అంతస్తుల్లో స్టాఫ్ క్వార్టర్స్ లో 36 ఫ్లాట్లు ఉంటాయి. 810 చదరపు అడుగుల స్పేస్ లో రెండు బెడ్ రూమ్స్, 12వేల 615 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 24 ఉన్నాయి. 12 అటెండెంట్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ను 325 చదరపు అడుగుల స్పేస్ లో నిర్మించారు. ఐటీ అండ్ ఎమినిటీస్ బ్లాక్ నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ బ్లాక్ ఐదు అంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్ఫ్లోర్లో 4 వేల చదరపు అడుగుల స్పేస్ లో సూపర్ మార్కెట్, క్యాంటీన్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్, హెల్త్ సెంటర్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్, ఇండోర్ గేమ్స్, స్టోర్ రూమ్ ఉంటాయి.