ట్రెండింగ్
Epaper    English    தமிழ்

29న పార్టీ ముఖ్య నేతలతో భేటీ : కుంతియా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2019, 01:02 PM

ఈనెల 29వతేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య నేతలతో చర్చిస్తామన్నారు. జూలై 1,2,3 తేదీల్లో క్షేత్ర స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు కుంతియా తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపై జూలై మొదటివారంలో సమీక్షించుకుంటామన్నారు. కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలియదన్నారు. ఎవరు క్రమశిక్షణను ఉల్లంఘించిన చర్యలు తప్పవన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com