ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్ఎస్ ఆఫీసుల శంకుస్థాపనలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2019, 01:59 PM

తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయలు ప్రతీ జిల్లాలో ఉండాలనిపార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిలో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా భవనాల శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తెరాసకు ఇప్పటి వరకు ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో కార్యాలయాలున్నాయి. ఈ చోట్ల మినహా మిగిలిన 29 చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు చేశారు. తొమ్మిది చోట్ల మంత్రులు, మిగతా జిల్లాల్లో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిసిల్లలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,ఎమ్మెల్యే కేటీఆర్‌ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయగ, సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ అధిష్ఠానం కేటాయించింది. అన్ని కార్యాలయాలు ఒకే నమూనాతో నిర్మించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com