కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్ కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల కోసం భూత్యాగం చేసిన నిర్వాసితులకు పాదాభివందనం అని పేర్కొన్నారు. కేసీఆర్ కూడా ఓ భూ నిర్వాసితుడేనన్నారు. కాళేశ్వరం ద్వారా సిరిసిల్లలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.