తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని, దసరా నాటికి సిరిసిల్లకు సాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ యావత్తు దేశం దీని వైపే చేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన నిర్వాసితులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. తన తల్లిదండ్రులు కూడా భూ నిర్వాసితులేనని, మిడ్ మానేరు ప్రాజెక్టులో తన తల్లి కూడా భూమిని పోగొట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఈ నెల 27 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కేసీఆర్ ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఓ పండగలా నిర్వహించాలని అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై టీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించున్నట్టు చెప్పారు.