గత కొన్ని నెలలుగా కేన్సర్తో బాధపడుతున్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్గౌడ్ ఆరోగ్యం విషమంగా ఉందని కుటుంబ వర్గాలు చెపుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన అపోలో ఆసుప్రతిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ముఖేష్గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలిసింది. కాగా అపోలో వైద్యులు వైద్యానికి ముఖేష్గౌడ్ శరీరం సహకరించపోవడంతో చికిత్స నిలిపివేశారని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఆసుపత్రికి కాంగ్రెస్ శ్రేణుల తాకిడి పెరగటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.