ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాద్రి రామాలయంలో భక్తుల రద్దీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2019, 08:09 AM

భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. అర్చకులు ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, ఆరాధన, పుణ్యవచనం, సేవాకాలం తదితర పూజలు గావించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు క్యూలైన్‌లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి రాముని నిత్య కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. భక్తుల రాక సందర్భంగా రామాలయం ప్రాంగణం సందడిగా కనిపించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com