ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ‌ర్క‌ల్‌లో రోడ్డెక్కిన విద్యార్థినులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2019, 12:26 AM

తెలంగాణాలో విద్యార్ధులు రోడ్డు కెక్క‌డ ప‌రిపాటిగా మారుతోంది. ఈ క్ర‌మంలోనే సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామం వద్దగల తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళశాల ప్రిన్సిపాల్ తీరుకు నిరసనగా విద్యార్థినిలు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. 


కళాశాలకు ఒక్క రోజు ఆలస్యంగా  వచ్చినందుకు విద్యార్థులను లోనికి ప్రిన్సిపాల్ అనుమతించకపోవడం ప‌ట్ల త‌మ‌దైన తీరులో నినాదాలు చేస్తూ,   ప్రిన్సిపాల్ తీరుని నిరసిస్తూ త‌ల్లిదండ్రుల‌తో క‌ల‌సి క‌ళాశాల ప‌క్క‌నే ఉన్న జాతీయ‌ రహదారిపై దర్నా చేశారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలుసుకున్నపోలీసులురంగ ప్ర‌వేశం చేసి, ప్రిన్సిపాల్ కు న‌చ్చ‌చెప్ప‌డంతో చివ‌రికి వారిని పిలిపించి, అనుమతిస్తున్నట్లు చెప్పడంతో తల్లిదండ్రులు ధర్నా విరమించ‌డంతో ఊపిరి పీల్చుకున్న‌ట్ట‌య్యింది.  


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com