గురు పౌర్ణమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. షిరిడీలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సాయి నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.