ప్రస్తుతం ప్రధాని స్థానంలో నరేంద్ర మోదీ ఉన్నారు కదా. మోదీ ఉండగా నన్ను తీసుకుని ప్రధానమంత్రిని చేస్తారా? అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనతో బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు రొన్ని కథనాలు చూస్తున్నానని, అది బుర్రలేని వాళ్లు పెట్టే చర్చ అని, ఆ తరహా ఆలోచనలు తను చేయబోనని బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యలపై ప్రజలు తమ ప్రశ్నించే గొంతుగా తనను పార్లమెంటుకు పంపించిన విషయం గుర్తెరగాలని తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినిపిస్తానని అంతే తప్ప వేరే ఆలోచన చేయబోనని స్పష్టం చేశారు.