హైదరాబాద్ నగరంలో రోజూ ఏదొక మూలన హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ఎంఐజీ కాలనీలో దారుణ హత్య చోటు చేసుకుంది. రాజశేఖర్రెడ్డి(44) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశారు. హత్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.