కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మెజారిటీ కోల్పోయారని మాజీ ముఖ్యమంత్రి బిజెపి నేత యెడ్యూరప్ప అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం లేదని ఆయన చెప్పారు. శాసనసభలో కుమారస్వామి విశ్వాసపరీక్ష రేపు జరుగనున్నది. ఈ విశ్వాస పరీక్షకు హాజరు కావాలా? వద్దా? అనేది రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని యెడ్యూరప్ప ఉటంకించారు.