వికారాబాద్: నడుస్తున్న ఆర్ టి సి బస్సులో నుండి పడి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ లో జరిగింది. ఏంన్నెపల్లి గ్రామానికి చెందిన నర్సిములు (60) అనే వికారాబాద్ రైల్వే బ్రిడ్జి పైన బసులో నుండి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే నర్సిములును వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.