తెలంగాణ అసెంబ్లి ప్రత్యేక సమావేశాలు ఇవాళ, రేపు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లి సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అసెంబ్లిలో ప్రవేశపెట్టనున్నారు. సభలో ఉద్యోగుల వయస్సు సవరణ బిల్లును, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును, రుణ విముక్తి బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. సర్వశిక్ష అభియాన్ వార్షిక నివేదికను మంత్రి జగదీశ్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సభ వాయిదా పడ్డాక బీఏసీ సమావేశం భేటీ కానుంది. తెలంగాణ పురపాలక చట్టం-2019 బిల్లుపై రేపు చర్చ జరగనుంది. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సమాధానమివ్వనున్నారు. రేపు మధ్యాహ్నం శాసన మండలి సమావేశం జరగనుంది. బిల్లుపై చర్చించి శాసన మండలి ఆమోదముద్ర వేయనునుంది. ప్రతిపక్ష నేత లేకుండా తొలిసారి అసెంబ్లి సమావేశాలు జరగనున్నాయి.