ములుగు : తాడ్వాయి మండలం కాల్వపల్లిలో విషాదం నెలకొంది. ప్రియురాలి ఇంటి ముందు ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే యువతి బంధువులే కొట్టి చంపారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి స్వస్థలం గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామం. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.