ప్రస్తుతం స్టేషనరీ, ప్రింటింగ్, స్టోర్స్ శాఖకు శాఖలో తనకు పనేమీ లేదని.. దీన్ని పూర్తిగా మూసేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తానంటూ రాష్ట్ర స్టేషనరి, ప్రింటింగ్, స్టోర్స్ కమిషనర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను మార్చడానికి తాను పోలీస్ డిపార్ట్ మెంట్కు రాలేదని.. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చానన్నారు. రూ.2 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందన్న ఈ శాఖకు రూ.50 కోట్లు అప్పు ఉందని తెలిపారు. స్టేషనరి డిపార్ట్మెంట్లో కమిషనర్గా ఉంటూనే తాను సాంఘిక ఉద్యమం చేపడుతానన్నారు. . సామాజిక కార్యక్రమాలతో ప్రజల అవసరాలను తీర్చితేనే బంగారు తెలంగాణ అవుతుందని దీనికోసం అవగాహన కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.
చంచల్ గూడ జైలు డీజీగా ఖైదీల సంక్షేమం కోసం అహర్నిశలు పని చేశానని, తను చేపట్టిన సంస్కరణలు ఫలితాలు అందుతున్నాయని అన్నారు, హైదరాబాద్లో బిచ్చగాళ్లు రోడ్లపై ఆకలితో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆనంద ఆశ్రమం ఏర్పాటు చేస్తే, ఇప్పటికి 15 వేల మంది భిక్షగాళ్లకు ఆశ్రయం దొరుకుతోందని చెప్పారు.