ప్రధాని నరేంద్ర మోడీ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను జవాన్లకు సంఘీభావం తెలపడానికి కార్గిల్ వెళ్లానని మోడీ అన్నారు. అప్పట్లో తాను జమ్ము కాశ్మీర్లోనూ, హిమాచల్ ప్రదేశ్లోనూ పార్టీని పటిష్టపరిచే పనిలో ఉన్నానని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. కార్గిల్ వెళ్లడం, అక్కడ జవాన్లతో సమావేశమవడం మరిచిపోలేని విషయమని ఆయన అన్నారు.