హైదరాబాద్: సూర్యాపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ప్రారంభించి విద్యార్థులకు నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో మంత్రి జగదీష్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు. మెడికల్ కాలేజీని సాధించిన కొత్త జిల్లా సూర్యాపేట ఒక్కటే కావడం సంతోషంగా ఉంది. జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలంతా రుణపడి ఉంటారు. తక్కువ సమయంలో మెడికల్ కాలేజీలో తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులకు ధన్యవాదాలు. అభివృద్ధిని అడ్డుకునేందుకు చిల్లర రాజకీయాలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి పేర్కొన్నారు.