ప్రశ్న : బిజెపి ప్రభుత్వ త్రిపుల్ తలాక్ బిల్లు ను రాజ్యసభ ఆమోదించింది. ఇంతకు ముందే దీనిని లోక్సభ ఆమోదించింది. కాని విపక్షాలు ఎందుకని దీనిని వ్యతిరేకిస్తున్నాయి?
- ఎం. కిశోర్, విజయవాడ
ఛైర్మన్ జవాబు :
బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళ వివాహ హక్కు పరిరక్షణ చట్టం) బిల్లు కు రాజ్యసభలో ఎట్టకేల కు ఆమోదం ల భించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్లోబిల్లు కు అనుకూంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు. బిల్లు కు అనుకూంగా 99 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు. బీజేపీ సొంత సభ్యులు ఉండగా.. మిత్రపక్షా మద్దతుతో బిల్లు కు ఆమోదం భించింది. బిల్లు కు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో చట్టంలో పొందుపరిచిన విధంగా కఠిన చట్టం అమ కానుంది.
ట్రిపుల్ తలాక్ బిల్లు ను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యు సభలో బిల్లు కు వ్యతిరేకంగా ఓటువేశారు. ఇది వరకే రెండుసార్లు రాజ్యసభలో బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఏ ఒక్క మతానికో ఈ బ్లిు వ్యతిరేకం కాదని, లింగ సమానత్వం కోసమే బ్లిును ప్రవేశపెడుతున్నామని తెలపగా . ట్రిపుల్ తలాక్ ను ఇప్పటికే ముస్లిం దేశాలు నిషేధించాయని చెప్పినప్పటికీ ట్రిపుల్ తలాక్ ను తీవ్రమైన నేరంగా పరిగణించరాదని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూన్నాయి. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఎంతో మంది అమాయకులు జైలు పావుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుతో భర్తను జైలు పంపితే... భార్యకు భరణం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నాయి. ఈ బ్లిుకు తాము వ్యతిరేకమని చెబుతున్నాయి. బిల్లు పున:సమీక్షించాని కోరుతున్నాయి.