రాజేంద్రనగర్ నియోజకవర్గ లోని కిసమత్ పూర్ లో తెలంగాణా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రంగరెడ్డి జిల్లా ఛైర్పర్సన్ తీగల అనిత రెడ్డి , రంగరెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు.