కాళేశ్వరం ప్రాజెక్టు తో నీటి కష్టాలు శాశ్వతంగా దూరం కానున్నాయని చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గం లోని గంభీరావుపేట కు చెందిన రైతులు, తెరాస నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో కలిగే లాభాలను ఎమ్మెల్యే సుమన్ వారికి వివరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో నిర్మించిందని అన్నారు.