బీజేపీ వలసలను ప్రోత్సహిస్తోందని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి బాగాలేదన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నింటిపై దృష్టి పెట్టాలన్నారు. ఈనెల 26న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై నిరసన తెలపనున్నట్లు చెప్పారు.