హైదరాబాద్: టీఆర్ఎస్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియటంతో.. గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గుత్తా సుఖేందర్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నుంచి ధ్రువ పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.