హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పీ.నర్సారెడ్డిని ఇవాళ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. నర్సారెడ్డి మనవడు ప్రత్యూష్ రెడ్డి ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని నర్సారెడ్డి నివాసంలో ఆయనను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నర్సారెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులను మంత్రి ఇంద్రకరణ్ ఓదార్చారు.