రాజకీయాల్లో మరీ ఎక్కువగా ఊహించుకుని ఏకంతా తెలంగాణ తల్లి పార్టీ పెట్టేసి వెంటనే జెండా ఎత్తేసి.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెల్లిగా స్థిరపడిపోయింది. కానీ.. కాలం కలసిరాక.. మళ్లీ హస్తం గూటికి చేరింది.. తెలుగు తెరపై లేడి అమితాబ్, ఒక మెగాస్టార్ .. తమిళనాడు, కర్ణాటకలో తానేమిటో చూపుదామని.. ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. పోనీ.. తనను ఇంతగా అభిమానించే తెలుగు వాళ్లయినా తనను నెత్తిన పెట్టుకుంటారంటే. తూచ్ అంటూ పక్కనబెట్టారు. మరి ఇంతటి అవమానాలు దిగమింగుతూ.. ఛీ రాజకీయాలంటూ.. చిరంజీవి జరిగినట్టుగానే పక్కకు వెళ్దామా అంటే ఎందుకో ఆమె ఇగో అంగీకరించట్లేదట. ఇంతకీ. ఆమె ఎవరో అర్ధమైందనుకుంటా.. ఎస్.. విజయశాంతి. కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మహేశ్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరుతో మూడో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా కోసం చాలా కసరత్తులు చేస్తున్నారట. మేకోవర్ తో తనను తాను చాలా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారంటూ టాలీవుడ్ లో ట్రోలింగ్ నడుస్తుంది. తాను కూడా.. నిజమే కదండీ.. 13 ఏళ్ల తరువాత మళ్లీ కెమెరా ముందుకు వెళ్తున్నానంటే ఆ మాత్రం జాగ్రత్త వద్దా అంటూ అడిగారనుకోండి. అయితే వచ్చిన చిక్కల్లా ఈ రాజకీయాలతోనే విజయశాంతి బీజేపీ తీర్దం పుచ్చుకోబోతునారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా నిజమేనా అంటూ ఎవరో మీడియా వ్యక్తులు అడిగితే.. నేను కాంగ్రెస్ లోనే ఉన్నా.. సోనియాతో నాకు మంచి పరిచయం ఉంది. రాహుల్ నేనెంత చెబితే అంత.. మద్యలో గాంధీభవన్ లో ఉన్న నా వ్యతిరేక వర్గం కావాలని ప్రచారం చేస్తుందంటూ పాపం ఆవేదన వెలిబుచ్చారట విజయశాంతి. అసలే గాంధీభవన్ అంటే రాజకీయ రంగస్థలం. అక్కడ పాత్రలు.. పాత్రధారులు ఎంతో మంది కనిపించినా అందరూ హీరోలే. అటువంటి చోట రాములమ్మపై కక్షగట్టి ఇలా దుష్ప్ర చారం ఎవ్వరు చేస్తున్నారనేది కనిపెట్టేందుకు తన వేగులను రంగంలోకి దింపారట .